'ఎంఫాన్' తుపాన్ ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంఫాన్ తుపాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా పరిణమించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ మనుషులు, జంతువులు, అన్ని రంగాలతో పాటు తాజాగా వాతావరణంపైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కాస్తు ముందుగానే వర్షాలు కురవనున్నాయి.
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో చలి వాతావరణం భయం పుట్టిస్తోంది. చలి ధాటికి రాజధాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ(బుధవారం) ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోయాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
మహారాష్ట్రలో తెల్లవారుజామున భూకంపం వణికించింది. ఉదయం 5 గంటల 22 నిముషాలకు భూమి కంపించింది. పాల్ఘాట్ జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.8 మెగ్నిట్యూడ్లుగా నమోదైంది. ఈమేరకు భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.