Don’t stop ambulances entering Telangana: TS High Court హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపేస్తున్నారనే అంశాన్ని తెలంగాణ హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపడం అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు... సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించింది.
How to apply for e-pass in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచే ఈ లాక్డౌన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏమేం కావాలి, ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలి అంటూ అనేక సందేహాలతో పౌరులు అయోమయానికి గురవుతున్నారు. వారి సందేహాలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
Konda Vishweshwar Reddy supports Eetela Rajender: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు మంత్రి కేటీఆర్కు లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితు, పలువురు నేతల తీరుతెన్నులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో గత 24 గంటల్లో 65,923 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో కొత్తగా 4,826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 7,754 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
Telangana lockdown updates: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే తప్ప కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
TS Medical staff recruitment notification:హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులకు తగినంత ఆక్సీజన్ నిల్వలు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ (Remdesivir injection) లేకపోవడం అందుకు ఓ కారణమైతే.. అసలు రోగుల సంఖ్యకు సరిపడే స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
Putta Madhu arrested by Ramagundam police: మంథని: రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్యపై వామన్ రావు తండ్రి కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, కోడలు హత్య వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందని కిషన్ రావు ఆరోపించారు. ఆ మాజీ మంత్రి అండదండలతోనే ఒక పథకం ప్రకారం వామన్ రావు దంపతులను (Advocate couple Vaman Rao murder case) పుట్టా మధు హత్య చేయించాడని కిషన్ రావు వాపోయారు.
Konda Vishweshwar Reddy meets Eetela Rajender: మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్లోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఈటలతో భేటీ అయి ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Telangana high court slams Medak collector in Eetela Rajender issue: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కి తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణ చట్టబద్దంగా లేదని, ఈ విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు.
Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్హౌజ్కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
Minister Eatala Rajender press meet: హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ తనపై వస్తోన్న భూ కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మీడియాలో తనపై వస్తున్న వరుస కథనాలను మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. అధికారిక పార్టీకి అనుకూలమైన ఛానెల్స్గా ముద్రపడిన మీడియాలోనూ మంత్రి ఈటల రాజేందర్కి వ్యతిరేక కథనాలు రావడం ఆయన కేబినెట్ పదవి గల్లంతేననే కథనాలకు మరింత బలం చేకూర్చినట్టయింది.
Eatala Rajender's minister post: హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా (Land encroachments) చేశారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు.
CM KCR's Health condition: హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం జరిపిన కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డా. ఎం.వి. రావు (MV Rao) ఆధ్వర్యంలో నిపుణుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా పరీక్షలు నిర్వహించారు.
LRS Scheme in Telangana: హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకం అమలు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేవరకు వేచిచూడాల్సిందేనని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు (TS High court) తేల్చిచెప్పింది.
Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు.
IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని (Liquid medical oxygen) రాష్ట్రానికి తీసుకురానున్నారు.
CM KCR's health condition latest updates: సీఎం కేసీఆర్కి కరోనా సోకినట్టు ఇవాళ జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆయనను ఫామ్హౌజ్లోనే ఐసోలేట్ కావాల్సిందిగా సూచించామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు (CM KCR's personal Dr MV Rao) తెలిపారు.
Telangana CM KCR health condition: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు కరోనావైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి స్వల్ప లక్షణాలు (Mild symptoms of COVID-19) మాత్రమే ఉన్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.