AP Exams: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.
Yaas Cyclone live updates: యాస్ తుపాను తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశలో కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ మంగళవారం మధ్యాహ్నం వెల్లడించింది. యాస్ తుపాను రానున్న 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశలో కదిలి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
Yaas Cyclone Alert: యాస్ తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను కదలికల నేపధ్యంలో తీసుకోవల్సిన చర్యలపై తీర ప్రాంతాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 90609 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 19,981 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం సంఖ్య 15,62,060 కి చేరింది.
Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు.
AP COVID-19 cases: అమరావతి: ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడటం లేదు. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 114 మంది కరోనాతో చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
Free treatment for COVID-19 and Black fungus: అమరావతి: దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతీ రోజూ ఏపీలో 25 వేల మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని ఓదార్పుయాత్రలో పరామర్శించాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు వైఎస్ జగన్. బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందర్నీ హత్తుకున్నాయి.
AP Budget Highlights: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వెలువడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, మహిళా సాధికారతకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం, ప్రభుత్వం విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశంసించారు.
Black fungus cases in AP : అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారమే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉత్తర్వులు వెలువడినట్టు తెలుస్తోంది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 23,160 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3528, చిత్తూరు జిల్లాలో 2670, అనంతపురం జిల్లాలో 2334, విశాఖపట్నం జిల్లాలో 2007, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 కేసులు వెలుగు చూశాయి.
Nitin Gadkari on Vaccine: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అంతరాయం. వ్యాక్సిన్ కోసం ప్రజానీకం ఎదురుచూపులు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాక్సినేషన్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్య రంగాల్ని బలోపేతం చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కరోనా మహమ్మారి వేధిస్తున్న వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాల్ని కల్పిస్తోంది. ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ..తదనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్డౌన్ టైమింగ్స్లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు (AP govt) స్పష్టంచేసింది.
YSR Matsyakara Bharosa Latest News: గత ఏడాది మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10000 జమ కానుంది.
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
Ap Government: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా బారినపడి పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయి. తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాధలవుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.