Telangana Politics: గులాబీ బాస్ కేసీఆర్ నోట కవితమ్మ మాట మళ్లీ వినిపించిందా..! బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. కవితకు సంబంధించిన ఓ వీడియోను నేతలతో పంచుకున్నారా..! ఈ వీడియోలో కవిత చేసిన ప్రసంగంపై ప్రశంసలు కురిపించారా..! ఈ విషయాన్ని కేరళ సీఎం స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారంటూ.. నేతలకు వివరించారా..! ఇన్నాళ్లు కవితను అస్సలు పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడా వీడియోలు సొంత పార్టీ నేతలకు ఎందుకు చూపిస్తున్నారు..! కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా..! కూతురిని మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా..!
Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. తాజాగా ఈ పార్టీలో ఆయన్ని డీ గ్రేడ్ చేయడంతో ఆయన మనస్తాపం చెంది.. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారైంది.
Telangana Municipal Elections: కాంగ్రెస్ అరాచకాలను ఎదిరించి ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్లకు సెల్యూట్ చేస్తూ, క్యాతనపల్లిలో సీపీఐ కామ్రేడ్ల పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రేవంత్ సర్కారుకు కౌంట్డౌన్ మొదలైందని, గులాబీ సైనికులను పార్టీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Ibrahimpatnam Municipal Election: పలు కారణాలతో వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠగా ముగిశాయి. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి పీఠాలను బిఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఇబ్రహీంపట్నంలో బిజెపి కౌన్సిలర్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. క్యాతనపల్లిలో బిఆర్ఎస్-సిపిఐ కూటమి విజయం సాధించింది. అయితే.. ఖానాపూర్లో తీవ్ర గందరగోళం, సభ్యుల వాగ్వాదం మధ్య అధికారులు ఎన్నికను ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో అక్కడ సస్పెన్స్ కొనసాగుతోంది.
Revanth reddy satires on kcr: గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటూ రైతులను తప్పుదొవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డి గత పాలకులపై తీవ్ర స్థాయిలోమండి పడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడని ఎద్దేవా చేశారు.
Harish Rao Speech In Assembly: తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇల్లీగన్ మైనింగ్పై హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. అనుమతులు లేకుండా ఎన్నో పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.
Pilot Rohith Reddy : తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
BRS Notice to Rohit reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి BRS పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Jeevan reddy: కాంగ్రెస్ మాజీమంత్రి జీవన్ రెడ్డి మరోసారి పార్టీని వీడనున్నట్లు చర్చలు జోరుగా సాగుతున్నాయి. గత కొంత కాలంగా పార్టీ తనను పట్టించుకోవట్లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రచారం జరుగుతున్న ఈ సారి మాత్రం పక్కాగా ఉగాది తర్వాత పార్టీ వీడుతున్నారని, ఇప్పటికే కారు ఎక్కేందుకు జీవన్ రెడ్డి సిద్దమైనట్లు తెలుస్తొంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జీవన్ రెడ్డి రచ్చ చర్చనీయాంశంగా మారింది.
Harish Rao Comments: రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీష్ రావు 8 ప్రశ్నలు సంధించారు.
Balka Suman: గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు ఫైనల్ గా మంచిర్యాల కోర్టు బెయిల్ ను మంజురు చేసింది. కోర్టు రూ. 25వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఉదయం బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ను వాయిదా వేసిన కోర్టు సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు క్యాతన్ పల్లిలో జరిగిన మంత్రివివేక్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపణల్లో బాల్కసుమన్ పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా..రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై గరమ్ అవుతున్నాయి.
Telangana Cabinet Meet: తెలంగాణ క్యాబినేట్ సోమవారం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు మెట్రో స్వాధీనం సహా ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ ఇన్యూరెన్స్ సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana Cabinet Meet: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతోపాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Telangana Muncipal election Result 2026: ఓటర్లు రాజకీయ పార్టీలకు ఖంగు తినిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పిచ్చెక్కించారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. 34 మున్సిపాలిటీల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగేలా చేశారు. మున్సిపాలిటీల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలను దుమ్మెత్తిపోసినవారు ఇపుడు కొత్త పాలకవర్గాలను ఏర్పాటుచేసేందుకు వార్డుసభ్యులను కూడగట్టుకోడానికి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. విలక్షణ తీర్పునిచ్చిన మున్సిపాలిటీల్లో ఏరాజకీయ పార్టీ.. ఎవరితో జతకడుతుందో అంతుబట్టడం లేదు.
Bandi Sanjay: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న వెలుబడ్డాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించినా.. కార్పోరేషన్స్ లో కాషాయ పార్టీ హవా నడించింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నీ తానై వ్యవహరించిన కరీంనగర్ లో బీజేపీ మెజారిటీ మార్క్ కు దగ్గరగా వచ్చింది.
TG Muncipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయ ..కవిత.. తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది.
TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజల్డ్ వేళ తెలంగాణలో క్యాంపు రాజకీయాలు వేడకెక్కాయి. ఫలితాలు వెల్లడి కాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను కాపాడుకునే క్రమంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.
Telangana Municipal Election Results 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్ధులతో పాటు ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
TG Muncipal Elections Results 2026: ఈ నెల 11 తెలంగాణ రాష్ట్రంలో మున్సినల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. చెదురు మొదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో భద్రతా బలగాలతో ఈసీ గట్టి ఏర్పాట్లు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.