Padma Rao : మునుగోడు తర్వాత తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో మరో ఎమ్మెల్యే కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది. ఇంతలోనే పద్మారావు ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి అతనితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చి వైరల్ గా మారాయి.
Kishan Reddy Fire: మజ్లిస్ బలోపేతం కొరకే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగిటివ్ ఆటిట్యూడ్ తో వచ్చే ఏ పార్టీకి మనగాడ లేదన్నారు.
KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
Kishan Reddy: సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. రాష్ట్రానికి అప్పులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
74 ఏళ్ల అనంతరం కేంద్ర హోంమంత్రి తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేశారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి నిజాంను ఓడించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారన్నారు.
Union Minister Kishan Reddy slams KCR : లక్షమంది కేసీఆర్ లు.. లక్ష మంది ఓవైసీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీ ప్రధాని కాకుండా ఆపలేరన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆ పూర్తి వీడియో ఇప్పుడు చూద్దాం.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
JP NADDA: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హన్మకొండ సభలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నయా నిజాంతో పోల్చిన జేపీ నడ్డా.. నిజాంను సాగనంపేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చీకట్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు జేపీ నడ్డా.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్దే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు.తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు హాజరయ్యారు.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు.
Telangana Elections: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీల్లోని సీనియర్ నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు, ఇక్కడే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి
Kishan reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్రల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిన ఘటన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Telangana Bonalu 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారును కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న రేవంత్రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Lashkar Bonalu 2022: Minister Talasani Srinivas Yadav Offers First bonam to Secunderabad Ujjaini Mahankali. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.