ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ (Gajendra Singh Shekhawat)ను ఏపీ మంత్రి అనిల్ యాదవ్ కలిశారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం (Polavaram Project) పూర్తి చేయాలన్నది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు.
పులస చేప.. దీనిగురించి మనం ప్రత్యేకంగా చేప్పాల్సిన పని ఉండదు. ఎంత ధర పలుకుతుందో.. అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ పులస చేప కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని డిమాండ్ ఎలా ఉంటుందంటే.. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే వీరాభిమానులు ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వైఎస్సార్సీపీ ఆ బిల్లులకు మద్దతు (YSRCP Supports for Agriculture Bills) తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ( YSRCP MLA Talari Venkat Rao ) కేసు నమోదైంది. ఆదిలక్ష్మి అనే మహిళ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా ద్వారకాతిరుమల పోలీసులను ఆదేశించింది.
మతాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీ (TDP) నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas). టీడీపీ హయాంలో ఓ మసీదులో జరిగిన మౌజన్ హత్య కేసును కేవలం రెండు రోజుల్లో చేధించిందని గుర్తుచేశారు.
ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు తెలుగు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో టెస్టులు నిర్వహించడంతో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్గా తేలింది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప (MP Reddappa Tests COVID19 Positive), అరకు ఎంపీ మాధవి కరోనా బారిన పడ్డారు.
కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (MLA RK Tests Positive for COVID19), తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్గా తేలింది.
గత కొంతకాలం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) (Kunapareddy Veera Raghavendra Rao Passed Away) కన్నుమూశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ దారి ఇచ్చిన ( AP CM YS Jagan's convoy ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వెంటాడుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA Chirla Jaggireddy Tests Positive For COVID) కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao Murder) హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) జైలు నుంచి విడుదలయ్యారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు (ఎంపీ), ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkata Ramana) కారు ప్రమాదానికి గురైంది. విశాఖలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్లో ప్రమాదం జరిగి వాహనాలన్నీ స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.