Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
Karnataka Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజులకు కేబినెట్ పూర్తి స్థాయిలో ఇవాళ విస్తరించనుంది. ఇవాళ మరో 24 మందికి కేబినెట్లో చోటు దక్కనుంది. పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్లో ఎవరికి ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..
Bandi Sanjay Kumar Satires on KCR Govt: " దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే... మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి.
Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరొకరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విస్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్షిణ ద్వారం మూసుకుపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని దాటుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది.
Congress Victory Secret: కన్నడ నాట కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాటి విస్పష్టమైన మెజార్టీ అందుకుంది. అధికార పార్టీ బీజేపీని 70 లోపలే అవుట్ చేసేసింది. కన్నడ కాంగ్రెస్ విజయం వెనుక ఇప్పుడు ఓ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది.
Karnataka Exit polls vs Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని దాటి మరీ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సొంత ఎజెండా మోస్తూ సర్వేలు చేసిన సంస్థలు అభాసుపాలయ్యాయి. విస్పష్టమైన మెజార్టీ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
Protest Against Ban on Bajarang Dal: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఎంతో ఆగ్రహంతో ఉంది అని బండి సంజయ్ అన్నారు.
Rahul Gandhi Eviction Notice: ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్సభ సెక్రటేరియట్కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని రాహుల్ బదులిచ్చారు.
Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో బారత్ జోడో యాత్ర 2 త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయమైంది. భారత్ జోడో యాత్ర 2 ఎప్పుడు, ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
Revanth Reddy Padayatra : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను నేడు ప్రారంభించారు. మేడారం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
టీకాంగ్రెస్ వార్ రూం కేసులో సీసీఎస్ పోలీసులు నేడు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు వస్తారా..? అనేది సస్పెన్స్గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట ఎంపీడీవో కార్యాలయం ముందు వృద్ధులు ఆందోళన చేపట్టారు. గత నాలుగు నెలలుగా పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర లేదన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.