VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది.
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్లో వరద నీటితో నిండిపోయింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మద్యం సేవించటం ప్రారంభించారు. 9 వ తరగతి చదువుకున్న కొంత మంది పిల్లలు మద్యం తాగి, క్లాస్ లోకి వెళ్ళటమే కాకుండా ఉపాధ్యాయుడిపై మద్యం తాగాడని ఫిర్యాదు ఇచ్చిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
Bandi Sanjay About PM Modi Meeting : హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో రేపు జరగబోయే మోదీ సభను సైతం కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ బీజేపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకోసం ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని సభకు తీసుకురావాలి. అదే విధంగా ఒక్కో డివిజన్ నుండి 2 వేల మందిని సభకు హాజరయ్యేలా చూడాలి. మోదీ..మోదీ... బీజేపీ నినాదాలతో ఓరుగల్లు మొత్తం మారుమోగాలి అని వరంగల్ ప్రజానికానీకి పిలుపునిచ్చారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
PMO Invites CM KCR: బీజేపి, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కంటే బీజేపీని ఎన్నుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను ఎలా కోరారో ఇటీవల చూశాం.
Outer Ring Rail Project in Telangana: ఈనెల 8వ తేదీన వరంగల్ కు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో బీజేపి నేతలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
Hanmakonda Road Accident News: ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా దంపతులు భాష మార్చుకోవాలి అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చల్ల ధర్మా రెడ్డి హెచ్చరించారు. మొగతనం ఉన్నదా లేదా అని కొండా మురళి దంపతులు సవాళ్లు విసురుతున్నారు.. మరి తమ మగతనం గురించి కొండా కుటుంబానికి ఎలా చెప్తారో వాళ్లే చెప్పాలి అంటూ చల్ల ధర్మా రెడ్డి ఎద్దేవా చేశారు.
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్పై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటీవల ఒక వివాహితపై ఆటో డ్రైవర్లు చేసిన హత్యాచారం చర్చనీయాంశం అయింది. ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.