Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి ఆ పార్టీ నేతలకు ఓ లేఖను విడుదల చేశారు. పార్టీ కార్యాలయం గతంలా లేదని విమర్శించారు. గాంధీ భవన్లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయ్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy fires on BRS over Govt Jobs in Telangana. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
YS Sharmila : పోలీసులపై చేయి చేసుకోవడంతో వైయస్ షర్మిల మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Etela Rajender Vs Revanth Reddy: కాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడ్వటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపు వస్తుందన్నారు.
Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Revanth Reddy About Etala Rajender: ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. అని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.
DK Aruna : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ ఇచ్చారని ఈటెల ఆరోపణల మీద డీకే అరుణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఖండించిన వ్యాఖ్యల మీద సైతం అరుణ మాట్లాడారు. నిజం మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎందుకు రోషం అని సెటైర్లు వేశారు.
Komatireddy Raj Gopal Reddy on Revanth Reddy: ఎమ్మెల్సీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రస్థాయంలో మండిపడ్డారు. నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే భేటీల పరంపర కొనసాగుతోంది. రేణుక చౌదరితో రేవంత్ భేటీ అవ్వడంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Mallu Bhatti vikramarka Padayatra: పెద్దపల్లి జిల్లాలో మరోసారి కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Revanth Reddy on Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని.. కానీ ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా.. అంటూ తప్పించుకున్నారని అన్నారు.
Revanth Reddy Speech: వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Revanth Reddy Press Meet About ktr: ఈ ప్రాజెక్టులో ఒక్కో అపార్ట్మెంట్ సగటున 8000 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇట్లా 200 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇంత లగ్జరీ (సుమారు రూ.20 కోట్లకు ఒక అపార్ట్మెంట్) అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వాళ్లు ఇంటికి కనీసం 5 కార్లు ఉంటాయి. ఆ లెక్కన వేసుకుంటే మొత్తం 1000 కార్లు ఈ నిర్మాణంలో ఉంటాయి. ఈ వెయ్యి కార్లు ఉదయం ఒకేసారి బయటకు వస్తే పరిస్థితి ఊహించుకోవచ్చు.
Revanth Reddy Slams KCR and KTR: కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.