ప్రపంచం మొత్తానికి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ భయం పట్టుకుంది. వ్యాక్సిన్ కోసం నిరీక్షిస్తున్న తరుణంలో వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఓ శుభవార్త అందిస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తోంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఎలాగైనా కోవిడ్ 19 టికా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేశాయి.
ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై సైబర్ దాడి జరిగింది. ఫలితంగా 5 దేశాల్లో ఉత్పత్తుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 24 గంటల తరువాత ఉత్పత్తుల్ని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది.
రష్యాకు చెందిన స్పూత్నిక్ వీ కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19) రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్ కు భారత దేశంలోఅనుమతి లభించింది. మనుషులపై జరిగే ఈ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( Drug Controller General Of India ) డాక్టర్ రెడ్డీస్ ఫార్మాసూటికల్ సంస్థకు పర్మీషన్ ఇచ్చింది.
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తయారీ అనంతరం మరో పెద్ద సవాలు ఎదురుకానుంది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అతిపెద్ద సమస్యగా మారనుంది. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రం వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
భారత్ బయోటెక్ (Bharat Biotech) ఇంటర్నేషనల్ కోవాగ్జిన్ ( Covaxin) పేరుతో కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవాగ్జిన్ మూడో దశ క్లినికిల్ ట్రయల్స్ నవంబర్ నెలలో చేయనున్నట్లు సమాచారం.
కరోనా వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం, మధ్య తరగతి వర్గీయులకు అందించే ప్రత్యేక ధరను నిర్ణయించింది.
ప్రస్తుతం చివరి దశలో ఉన్న వ్యాక్సిన్లు, మార్కెట్లోకి వచ్చిన వ్యాక్సిన్ల కన్నా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ (Johnson and Johnson COVID-19 vaccine) సింగిల్ డోస్ ద్వారా కరోనాను అంతం చేయవచ్చునని కంపెనీ తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఉంది. వ్యాక్సిన్ సిద్ధమైతే..పంపిణీ కోసం దేశం సిద్దంగా ఉందా..80 వేల కోట్లున్నాయా అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ కోసం మరో భారతీయ కంపెనీ సిద్ధమౌతోంది. దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
నవంబర్ 3 న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల నిలిపివేతపై మరో భాగస్వామ్య కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. భారత్ లో ప్రయోగాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.